MDK: హవేలీ ఘనపూర్ మండల సర్దన గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ రాజ్యలక్ష్మి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. 1987లో టీడీపీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. తొలి ఎంపీపీగా ఐదేళ్ల పాటు సేవలందించారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలను ఆల్వాల్ మంగాపురం కాలనీలో నిర్వహించనున్నారు. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.