NLG: థాయిలాండ్ దేశానికి చెందిన సుమారు 20 మంది బౌద్ధ భిక్షువుల బృందం శుక్రవారం నాగార్జునసాగర్లోని నందికొండ మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేశారు. స్థానికులు వారికి బిస్కెట్లు, చాక్లెట్లు, బ్రెడ్లు, పండ్లు, ఆహార పదార్థాలను అందించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, సిబ్బంది కూడా పాల్గొన్నారు.