SRCL: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇవాళ ఆయన విద్యాశాఖపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బట్టి పద్ధతిలో కాకుండా పిల్లలకు విషయ పరిజ్ఞానం అందేలా ఇంటరాక్ట్ చేస్తూ బోధన జరగాలన్నారు. ఉన్నతాధికారులు ప్రతి పాఠశాలను నాణ్యతతో తనిఖీ చేసి, రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు.