NRPT: అక్రమంగా సిలిండర్లు నిల్వ చేసుకుంటే వాటిని సీజ్ చేయడం జరుగుతుందని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులు తెలిపారు. శనివారం హోటళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డీటీతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించి 14 గృహ ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాటిని భద్రంగా ఉంచడానికి గురు కృప భారత్ గ్యాస్ ఏజెన్సీకి అప్పగించామని అన్నారు.