MLG: మంగపేట (M) నర్సింహాసాగర్లో కొన్ని రోజులుగా వీధిలైట్లు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకట్లో బయటకు రావాలంటే పాములు, విషపురుగులు, దొంగల భయంతో భయాందోళనకు గురవుతున్నారు. పాములు రోడ్లపై తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే లైట్లు మరమ్మతు చేసి సరిచేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.