WGL: ఎంజీఎం సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఆదివారం ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. TGNPDCL CMD కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. HNK కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కళాశాల ప్రిన్సిపల్ డా. బైరి ప్రభాకర్, కళాశాలలో చదివి ఉన్నత స్థితిలో ఉన్నవారు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.