NRPT: ఊట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామ ప్రతినిధులు నారాయణపేట విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్ నవీన్ను కలిసారు. తక్కువ వోల్టేజ్, లూజ్ లైన్లు, కర్రలపై విద్యుత్ లైన్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్. నర్సిములు, భారతీయ కిసాన్ సంఘం నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.