హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పీఎస్ పరిధిలోని సాదత్ నగర్లో దారుణం జరిగింది. బ్రదర్స్ డే రోజే సొంత తమ్ముడిని అన్నే హతమార్చాడు. రోటీ మేకర్స్ పనిచేసే మహ్మద్ ఫారూఖ్, తన తమ్ముడు మహ్మద్ సమీర్ (25)పై తీవ్రంగా దాడి చేయడంతో సమీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరికీ పెళ్లి కాలేదు. గొడవకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.