MBNR: గండీడ్ మండలంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శుక్రవారం విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటన వివరాలు.. మధ్యాహ్నం 3 గంటలకు రైతు వేదికలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేయనున్నారు. అనంతరం జెడ్పీ హైస్కూల్లో కొత్త గదులు, సైన్స్ ల్యాబ్ ప్రారంభిస్తారు. అలాగే స్థానిక సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు కాంగ్రెస్ట్ నాయకులు తెలిపారు.