NZB: ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్లో భాగంగా ఉద్యోగుల, పెన్షనర్ల, జర్నలిస్టుల కోసం నగరంలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లో డాక్టర్లను నియమించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు.