PDPL: మంథని మండలం గుంజపడగు గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్కు రూ.15 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ కల్పించినట్లు సర్పంచ్ దండవేన సంధ్య తెలిపారు. ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి శ్రీజారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. రూ.15 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ పొందిన వారిలో అయిలి రవి, చెవుల శ్రీనివాస్, కంటే గణేశ్, తదితరులు ఉన్నారు.