నిజామాబాద్: జాతీయ స్థాయి హాకీ పోటీలకు సిరికొండ మండలం తూంపల్లి క్రీడాకారిణీ జశ్విత ఎంపికయ్యారు. తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 25 నుంచి 30 వరకు నిర్వహించిన క్యాంపులో జశ్విత ప్రతిభ కనబరిచిందని పీడీ సడక్ నగేశ్ తెలిపారు. కాగా ఈ జాతీయ స్థాయి పోటీలు జులై 3 నుంచి 8వరకు జార్ఖండ్లో జరగనున్నాయని ఆయన వెల్లడించారు.