NLR: నందిగామలో సోమవారం రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేద కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అయన మాట్లాడుతూ.. మొత్తం అర్జీలు 15 వచ్చినవని అన్నారు. సదరు అర్జీలను సంబంధిత అధికారులు సకాలంలో పరిష్కరించే విధముగా చర్యలు చేపడతామని తెలిపారు.