VSP: జిల్లా గంజాయి కేసులో నిందితుడు నెల్ల తేజమూర్తికి 14 ఏళ్ళ కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1.40 లక్షలు జరిమానా విధిస్తూ.. విశాఖ మెట్రోపాలిటన్ మొదటి అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం తెలిపారు. జరిమానా చెల్లించకపోతే మరో 6 నెలల సాధారణ జైలు శిక్ష అదనంగా విధించబడుతుందన్నారు.