VSP: ప్యాసింజర్ రైలు చార్జీల పెంపు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నాయని విశాఖ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. సాధారణ తరగతిలో 500 కి.మీ. వరకు దూరాలకు ఎటువంటి పెంపూ లేదు. 501 నుంచి 1500 కి.మీ. దూరాలకు రూ. 5, 2500 కి.మీ. దూరాలకు రూ. 10, 2501 km నుంచి 3000 కి.మీ. దూరాలకు రూ. 15 పెంపు ఉంటుందని రైల్వే శాఖ ప్రకటించింది.