KRNL: నేటితరం విద్యార్థులకు చట్టసభలపై అవగాహన కల్పించడం ఎంతగానో అవసరమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. సోమవారం నగరంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవితంలో ఎవరూ కూడా ఆశించి పని చేయరాదని అన్నారు.