VZM: భోగాపురం మండలం ముక్కాంలో తాగునీటి పైప్ లైన్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 25 ఏళ్ల నుంచి తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఏళ్ల కాలం నుంచి ఉన్న సమస్యను పరిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. వివిధ వనరులు నుండి నిధులు సేకరించి తాగు నీటి పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.