KRNL: తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ మోసం చేసిన ముఠాను కర్నూలు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బాధితుడి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నెల్లూరు, కర్నూలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నకిలీ బంగారు బిస్కెట్లు, నగదు, పోలీస్ యూనిఫామ్స్, వాకీ టాకీలు, హ్యాండ్ కఫ్స్ సహా అనేక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.