KDP: పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి వీరపునాయన పల్లె మండలంలో 6340 మంది రైతులు అర్హులని వ్యవసాయ అధికారి శ్యాంబాబు సోమవారం తెలిపారు. నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్క రైతుకు నిధులు త్వరలో ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆయన అన్నారు. బ్యాంక్ అకౌంటుకు ఆధార్ లింకులేని రైతులు వివరాలను కూడా ఇప్పటికే సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.