అన్నమయ్య: వైకాపా ప్రభుత్వ హయాంలోనే విద్యారంగం నాశనం అయ్యిందని టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్ ఎద్దేవా చేశారు. సోమవారం స్థానిక మదనపల్లె పార్లమెంట్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ఈసెట్ కౌన్సిలింగ్ నిర్వహణపై విమర్శించడం జగన్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనమని పోలి శివకుమార్ విమర్శించారు.