VSP: జిల్లాలో దువ్వాడ దరి గొల్లలపాలెం ప్రాంతంలో సప్త ఋషి వేద పాఠశాల ఆధ్వర్యంలో వైభవంగా వేద దివస్ వేడుకలు నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది వేద పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిరుద్ర పారాయణ నిర్వహించారు. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు మాధవ శర్మ తెలిపారు.