SKLM: సంతబొమ్మాలి మండలం వడ్డివాడ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు మెండ రామినాయుడు సోమవారం కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలకు నాలుగు ఫ్యాన్లను వితరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్ధులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని తెలిసిన వెంటనే 4 ఫ్యాన్లను అందజేశామని తెలిపారు.