CTR: బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద మామిడి తోటలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. మృతదేహం పాడైన స్థితిలో ఉండటంతో చాలా రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.