KDP: మైదుకూరులో నాఫెడ్ సంస్థకు భూమి కేటాయింపు చేయాలని జిల్లా కలెక్టర్ తహసీల్దార్ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా సోమవారం మైదుకూరు తహసీల్దార్ సురేంద్రను BJP నేతలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. దీని ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతాపరెడ్డి, ఏ.శేఖర్ రెడ్డి, బీసీ గుర్రప్ప, జి. రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.