కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు కొనసాగుతారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత ఆర్వీ దేశ్పాండే వెల్లడించారు. సీఎంగా సిద్ధరామయ్యకు బదులు డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరిస్తారని వస్తున్న వార్తలను ఖండించారు. ‘నాయకత్వ మార్పు గురించి ఎలాంటి ప్రతిపాదన లేదు. చర్చ కూడా జరగలేదు. శాసన సభ్యుల సమావేశంలో ఎప్పుడూ చర్చకు రాలేదు. మేమంతా ఐక్యంగా, సమర్థవంతంగా పని చేస్తున్నాం’ అని చెప్పారు.