తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల DCOగా టీ. పద్మజ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టర్ వెంకటేశ్వర్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల గురించి ఆయనతో చర్చించారు.