KRNL: కర్నూలు నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దృష్టి సారించారు. సోమవారం కర్నూలులోని మంత్రి కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను అర్ధం చేసుకొని వాటికి తగిన పరిష్కారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.