MHBD: ప్రజలు తమ సమస్యలకై ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నేడు నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. 148 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.