HNK: జూలై 4న ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ కాంగ్రెస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించబోయే ఆత్మీయ సమావేశానికి కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు.