ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కొండపి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలు పాల్గొని తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రికి అందజేశారు. అర్జీలను స్వీకరించిన మంత్రి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు.