నారాయణపేట: నర్వ మండలం రాయికోడ్ గ్రామం 10వ వార్డులో విద్యుత్ స్తంభాలకు కొత్త ఎస్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. సర్పంచ్ పీ. శశికళ రవికుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది వీటిని అమర్చారు. రాత్రి వేళల్లో ప్రజలకు మెరుగైన వెలుతురు, భద్రత కల్పించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఎస్ఈడీ బల్బులతో విద్యుత్ ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు.