MBNR: హన్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కమ్ సెక్రెటరీ డి.ఇందిర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె బాలికల చట్టాలు, హక్కులు, భద్రత గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈవో తదితరులు పాల్గొన్నారు.