SDPT: హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో తండ్రి-కొడుకులు ఒకే బస్సులో విధులు నిర్వహించడం ప్రయాణికుల దృష్టిని ఆకర్షించింది. 34 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న బంధనాపురం ఎల్లయ్య, ఆయన కుమారుడు ప్రేమ్ కండక్టర్గా సేవలందిస్తున్నారు. శుక్రవారం ఇద్దరూ ఒకే బస్సులో డ్యూటీ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఉత్తమ డ్రైవర్గా పలుమార్లు ఎల్లయ్య అవార్డు అందుకున్నారు.