RR: యాచారంలోని కుర్మిద్ద, తాటిపర్తి, మర్లకుంటతండా, సింగారం, అయ్యవారిగూడ, నంది వనపర్తి తదితర గ్రామాల్లో నిన్న ఈదురు గాలులతో కూడిన వడవగళ్ల వర్షం కురిసింది. దీంతో వరి, పంట పాలకూర, మెంతికూర, సోయికూర, పూదీన పంటలు పాడైనట్లు రైతులు తెలిపారు. పలుచోట్ల టమాట పంటకు నష్టం వాటిల్లినట్లు చెప్పారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.