MNCL: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే చలో హైదరాబాదును విజయవంతం చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు అంబటి సువర్ణ కోరారు. శుక్రవారం జన్నారంలోని సీఐటీయు కార్యాలయంలో ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఆశా వర్కర్లకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 23న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామన్నారు.