JGL: ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు కృషి చేయాలని ఒడ్యాడ్ సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ అన్నారు. భీమారం మండలంలోని ఈ గ్రామంలో బుధవారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాకేష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.