MNCL: తాండూరు మండలం కిష్టంపేటకు చెందిన శాంత (28)కు బుధవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు అధికమవ్వడంతో, ఈఎంటి శివకుమార్, పైలట్ తిరుపతి అంబులెన్స్లోనే సురక్షితంగా ప్రసవం చేశారు. శాంత ఆడబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. అనంతరం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.