సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి చెందిన లేగదూడను శనివారం రాత్రి గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొనడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి తల్లి ఆవు “అంబా.. అంబా..” అంటూ అరుస్తూ రాత్రంతా చుట్టూ తిరగడం స్థానికులను కంటతడి పెట్టించింది.