NRML: కడెం మండలం కల్లెడలో 10వ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయాన్ని చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్ కుమార్ గుర్తించారు. స్థానిక మల్లన్న ఆలయంలో చాళుక్య శైలిలో ఉన్న అద్భుతమైన రాతి స్తంభాలు, ద్వారపాలకులు, త్రిశూలం, గద ఆకృతులు వెలుగుచూశాయి. ఈ అరుదైన చారిత్రక సంపదను ప్రభుత్వం వెంటనే గుర్తించి కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.