MNCL: వరి కొయ్యలను కాలిస్తే భారీ జరిమానా విధించడం జరుగుతుందని మంచిర్యాల డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణ హెచ్చరించారు. బుధవారం జన్నారం మండలంలోని చింతగూడ రైతు వేదిక యందు వరి కొయ్యలను(పంట వ్యర్థాలు) కాల్చడం ద్వారా కలిగే దుష్ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించారు. వరి కొయ్యలను కాల్చే పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయని, దిగుబడి తగ్గిపోతుందన్నారు.