NLG: స్టాఫ్ నర్స్ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన నిందితుడు రఘురామ్ను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. HYDకి చెందిన వాణితో కలిసి సుమారు 60 మంది నుంచి రూ.1.85 కోట్లు కాజేసి ఈ సొమ్ముతో జల్సాలు చేస్తూ ప్లాట్లు, కార్లు కొనుగోలు చేసినట్లు సీఐ వెంకటయ్య వెల్లడించారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.