KMR: కోటగిరి మండలం కొత్తపల్లిలో ఆరోగ్య ఉప కేంద్రం, ముదిరాజ్ సంఘ భవనాన్ని శనివారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ముదిరాజ్ సంఘ కమ్యూనిటీ భవనాలు, పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణాలకు నిధుల మంజూరులో ప్రాధాన్యం ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముదిరాజ్ భవనంలో టాయిలెట్స్ కోసం రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు.