KNL: ఆదోనిలో రౌడీ షీటర్లపై పోలీసుల కఠిన వైఖరి కొనసాగుతోంది. టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆదివారం రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలు కాపాడటంలో సహకరించాలని, పోలీసుల పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు తెలిపారు.