RR: అందరూ ఆరోగ్యంగా జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. SDNR కోర్టు సముదాయంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వాతిరెడ్డి వైద్యశిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు 6 మాసాలకు ఒకసారి తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.