NLG: గట్టుప్పల్ మండల కేంద్రంగా ఏర్పడి మూడేళ్లవుతున్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంపై బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఇడం కైలాసం ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక సబ్ సెంటర్ను పరిశీలించిన ఆయన ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హాస్పిటల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు.