WGL: సంగెం మండలం రంగంపేటలో విషాదం చోటు చేసుకుంది. ఫంక్షన్కు తీసుకెళ్లలేదన్న మనస్తాపంతో గుగులోతు కవిత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త సుకుమార్ పిల్లలతో కలిసి ఫంక్షన్కు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న కవిత ఆవేదనతో ఈ అడుగు వేసినట్లు స్థానికులు తెలిపారు. తలుపు తీయకపోవడంతో అనుమానంతో చూడగా ఉరేసుకున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.