MDK: పెద్ద శంకరంపేట పౌరసరఫరాల గోదామును జిల్లా సివిల్ సప్లై డీఎం జగదీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని అన్ని దుకాణాలకు మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం సరఫరా ఎంతవరకు అందించారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని రేషన్ దుకాణాలకు మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.