NZB: జక్రాన్ పల్లి మండలం మాదాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన రైతులతో భేటీ అయ్యి, వారు ఎదుర్కొంటున్న భూ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పని తీరును పరిశీలించారు.