అన్నమయ్య: ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని రాయచోటి అర్బన్ సీఐ వెంకట చలపతి సూచించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ముస్లిం పెద్దలతో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగను మత విద్వేషాలు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు.