HNK: హనుమకొండ మండల తహసీల్దారుగా పనిచేస్తున్న శ్రీపాల్ రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. దాదాపు రెండున్నర సంవత్సరాలుగా హన్మకొండ తహసీల్దార్గా పనిచేస్తున్న శ్రీ పాల్ రెడ్డికి రెవెన్యూ శాఖలో సౌమ్యుడిగా పేరు ఉంది. శ్రీపాల్ మరణంతో కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ వైవి గణేష్, ఆర్డిఓ రమేష్ రాథోడ్ నివాళులర్పించారు